హైదరాబాద్: సమాజంలో సానుకూల మార్పు కోసం కృషి చేస్తున్న దార్శనికులను గుర్తించి సత్కరించే కార్యక్రమంలో భాగంగా, రిట్జీ గ్రూప్ సీఈవో ఎంఎన్ఆర్ గుప్తను ప్రతిష్టాత్మక ‘ఛేంజ్ మేకర్స్ అవార్డ్స్ – 2026’ వరించింది. బాలల సంక్షేమం (Child Welfare) విభాగంలో దశాబ్ద కాలంగా ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలకు గుర్తింపుగా అత్యున్నతమైన ‘వాన్గార్డ్ అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్’ (Vanguard Award of Excellence) దక్కింది.
‘బి ది చేంజ్ వెల్ఫేర్ సొసైటీ’ (B The Change Welfare Society) ఆధ్వర్యంలో మే 24, 2026 (ఆదివారం) న హైదరాబాద్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సభకు పలువురు రాజకీయ, సామాజిక, న్యాయ ప్రముఖులు హాజరయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జస్టిస్ రాధారాణి, ఇండియన్ అంబాసిడర్ ప్రకాశ్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఎంఎన్ఆర్ గుప్త ఈ అవార్డును అందుకున్నారు. సమాజాభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ అతిథులు ఆయనను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
బాలల సంక్షేమమే ధ్యేయంగా పదేళ్లకు పైగా అంకితభావంతో పనిచేస్తూ, సమాజంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు ఎం.ఎన్.ఆర్. గుప్తకు ‘అపెక్స్ అవార్డీ’ (Apex Awardee) కింద ‘వాన్గార్డ్’ గౌరవ బిరుదును ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకులు సర్టిఫికెట్లో పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో విజనరీ లీడర్గా గుర్తింపు ఉన్న ఎంఎన్ఆర్ గుప్తకు వందకుపైగా అవార్డులు సత్కరించాయి. తాజా విజయంపై ట్ల ఆయన స్పందిస్తూ , ఈ అవార్డుతో తన బాధ్యత మరింతా పెరిగినట్టు భావిస్తున్నానన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి టెక్ మహీంద్రా (Tech Mahindra) వెన్యూ పార్టనర్గా వ్యవహరించగా, మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఎస్ఆర్ (CSR) పార్టనర్గా సహకారం అందించాయి.

