డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు వ్యవహరంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజంలో ఆ మాటల మూలంగా అశాంతి ఏర్పడిందని ఆయనపై ఫిర్యాదు చేశారు ప్రజా శాంతి అధ్యక్షుడు కెఏ పాల్. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి FIR నమోదు చేయాలని అయన పంజాగుట్ట పోలీసులను కోరారు. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ను లేవనెత్తారు.