ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్కు
గురుకుల సమస్యలపై వినతి
NEWS Jul 26,2026 09:21 am
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, వాష్రూమ్లు, తాగునీటి సౌకర్యాలు సరిగా లేవని, ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందలేదని పేర్కొంటూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.