మెదక్ నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేసుకుని, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న నలుగురు లబ్ధిదారులకు ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు