రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట వంజరి సంఘం భవనంలో ఆదివారం నూతనంగా నియమితులైన నిజాంపేట మండల విద్యాధికారి సాంగని యాదగిరి, ఎంపీపీ ఎస్ రామాయంపేట ప్రధానోపాధ్యాయులు నవాత్ ప్రమోద్, రామాయంపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పటేరి రాము సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు నవాత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుల సోదరులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పదోన్నతి పొందిన సభ్యులు మరింత ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు