తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన కిష్టారం ఎల్లేష్ (35) గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. కుటుంబ కలహాలతో భార్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. మనస్థాపానికి గురైన ఎల్లేష్ నిన్న సాయంత్రం గడ్డి మందు సేవించగా, గాంధీ ఆసుపత్రికి చికిత్సకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వివరించారు