పవన్ కల్యాణ్పై తమిళనాడులో కేసు
NEWS Oct 05,2024 05:42 am
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కల్యాణ్పై మధురై కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని పేర్కొన్నారు.