మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్ లో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై ప్రజలు వెళ్లాలంటే ఆందోళనకు గురవుతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా ఉదయం నుండి రాత్రి వరకు వందల సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నాయని, పిల్లలు ఆడుకునేందుకు ఇంటి బయటకు రావాలంటే భయపడుతున్నారు. బైక్ పై వెళ్లే వారిని వెంబడించి దాడి చేస్తున్నాయి. అధికారులకు చెప్పిన పట్టించుకోవట్లేదని కుక్కల బెడద నుండి తమ కాలనీని రక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు.