AIG ఆసుపత్రిలో చేరిన కవిత
NEWS Oct 01,2024 08:04 am
ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గైనిక్ సమస్యలు.. తీవ్రమైన జ్వరంతో అనేకసార్లు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. బెయిల్ పై బయటకు వచ్చిన కవిత.. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలి AIG ఆస్పత్రికి ఈ రోజు వెళ్లారు. సాయంత్రానికి కవితకు వైద్య పరిక్షలు పూర్తి అయిన వెంటనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.