మెట్ పల్లి పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు ఆర్పించారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. బాపూజీ స్వాతంత్ర పోరాటం, తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలలో పోరాడిన మహనీయుడని వారి ఆశయాల సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు వారంలో ఒకసారి చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి తోడ్పాటు అందించాలని కోరారు.