బీజేపీ సభ్యత్వ కార్యక్రమాల జోరు
NEWS Sep 24,2024 04:58 pm
ప్రజల్లోకి వెళ్లి పార్టీ సభ్యత్వాలు చేయించాలని బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్పాండే, పట్టణ అధ్యక్షుడు ద్వారకారవి, నాయకులు పాల్గొన్నారు.