రాజన్న ప్రసాదంలో నాణ్యత పరీక్షించాలి
NEWS Sep 24,2024 04:54 pm
తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు సైతం నెయ్యి వ్యవహారంలో అప్రమత్తమయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిని హైదరాబాద్లోని ఓ ల్యాబ్ కు పంపారు. ఆలాగే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో లడ్డుల తయారీలో వినియోగించే నెయ్యిని కూడా ల్యాబ్ కు పంపించి పరిశోధించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.