చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి
NEWS Sep 24,2024 03:18 pm
ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహహింస, ఫోక్సో వంటి చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అనంతరం కళాశాలను పూర్తిగా పరిశీలించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ భాయి పాల్గొన్నారు.