హైదరాబాదును అనుకోని వున్నా మెదక్ జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మరోసారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది. ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు అధికారులు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఈ నెలలో మూడోసారి ఏడుపాయల ఆలయం మూత పడినట్లు తెలుస్తుంది.