ప్రజావాణిలో 65 ఫిర్యాదులు
NEWS Sep 23,2024 01:02 pm
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65 మంది తమ సమస్యలను విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.