పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Sep 23,2024 12:43 pm
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్ లో 1994 -95 బ్యాచ్ 10వ తరగతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువులను సన్మానించి తరగతి గదుల్లో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమానికి బూర్ల సంతోష్ దుబాయ్ నుండి, భోగ రవీందర్ ముంబై నుంచి వచ్చారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.