ఏఐటీయూసీ ఒత్తిడి వల్లే
కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా
NEWS Sep 22,2024 06:41 pm
సింగరేణి లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు రూ.5 వేలు వాటా చెల్లించేందుకు తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఒప్పుకుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అద్యక్షులు సీతారామయ్య తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ కాంట్రాక్టు కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎవరెన్ని చెప్పినా లాభాల్లో వాటా అనేది ఏఐటియుసి పేటెంట్ అన్నారు.