దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని
ఆవిష్కరించిన బోగ శ్రావణి
NEWS Sep 22,2024 06:44 pm
జగిత్యాలలోని లోకమాత గాజుల పోచమ్మతల్లి దేవాలయంలో భవాని భక్త బృందం గత 46 ఏళ్లుగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్, స్థానిక కౌన్సిలర్ లలిత మునిందర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, కళావతి, రాజేందర్, గాజుల రాజేందర్, నారాయణ, భవాని భక్త బృందం, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.