రేపటి నుంచి జిల్లా స్థాయి క్రీడలు
NEWS Sep 22,2024 11:10 am
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు 23 నుంచి 28 వరకు పటాన్ చెర్ మైత్రి మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. 23న బాలురకు, 24న బాలికలకు కబడ్డీ, 25న బాలురు, 26న బాలికలకు వాలీబాల్, 27న బాలికలు, 28న బాలురకు ఖోఖో పోటీలు జరుగుతాయని చెప్పారు.