ఉమ్మడి కరీంనగర్లో పట్టాలెక్కిన వందేభారత్
NEWS Sep 16,2024 06:39 pm
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్కార్లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో రూ.1,510గా ధర నిర్ణయించారు.