జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి
NEWS Sep 16,2024 09:04 am
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్ లకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కమిషన్లు ఎలాంటి జ్యుడీషియల్ అధికారాలు లేకపోవడంతో బీసీలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. వెంటనే జ్యుడీషియల్ అధికారం ఇచ్చి బీసీలకు భరోసా కల్పించాలని కోరారు.