కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
NEWS Jun 14,2026 08:25 pm
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్ ఆదేశాలతో, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 400 మంది సిబ్బంది డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. పాపతో ఉన్న కనిపించిన పెంపుడు కుక్క ఇటీవల మృతి చెందడంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. కుక్క మృతికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి జిల్లా యంత్రాంగం రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించింది.