కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది: మోదీ
NEWS Sep 14,2024 07:01 pm
హర్యానా: హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్కు ఓటు వేసినందుకు కర్ణాటక, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.