మొబైల్ ఫోన్లో చోరీ నిందితుల అరెస్టు
NEWS Sep 12,2024 06:24 pm
తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన వాహన తనిఖీలో మొబైల్ చోరీ నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై శివానందం తెలిపారు. రావెల్లికి చెందిన బాణాపురం రాజుకు చెందిన మొబైల్ 9న బస్టాండ్ వద్ద చోరీకి గురైనట్లు వివరించారు. ఈరోజు వాహన తనిఖీ చేపట్టగా ఆ ఫోన్ తో పాటు 17 ఫోన్లు లభించినట్లు వివరించారు. ఈడిగ రవికుమార్ గౌడ్, సత్పాడి అరవింద్ లతో పాటు ఇద్దరు చిన్నారులను పట్టుకున్నట్లు వివరించారు. వీరు వద్ద నుంచి రూ. 5 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.