కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి కీలక పదవి
NEWS Sep 12,2024 12:46 pm
ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ గా టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాల సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని
బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు, సభ్యదేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానన్నారు.