దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం నుంచి వస్తుండగా చింతాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు హిజ్రాలు డబ్బుల కోసం ఆపారన్నారు. డబ్బులు లేవని చెప్పగా జేబులో నుంచి రూ.4వేలు లాక్కొని మరో వ్యక్తి సాయంతో పారిపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.