ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామంలో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం అమ్మకం సాగిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని వద్ద నుంచి 162 ఎన్డీపియల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.