వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల వేద మంత్రోచ్చారణల మధ్ మంగళ హారతి పట్టి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడున్న భక్తుల కోరిక మేరకు వినాయకుడితో బండి సంజయ్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ బండి సంజయ్.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.