తెలంగాణలో టీడీపీ కమిటీలన్నీ రద్దు
NEWS Aug 25,2024 03:14 pm
తెలంగాణలో పార్టీ పటిష్టత, బలోపేతంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అడ్హక్ కమిటీలు రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.