కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
NEWS Jul 25,2026 05:26 pm
నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు పాల్గొనగా.. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్లు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.విద్యార్థులు సీజేపీ నిరసనకారుల ప్రధాన డిమాండ్ నెరవేరడంతో డిల్లీలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి.