ప్రజల నాయకుడు రంగా: ఎమ్మెల్యే
NEWS Aug 25,2024 02:49 pm
పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామంలో దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరాలు గడిచిన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్న నేత వంగవీటి రంగా అని, పల్లె పల్లెల్లో ఆయన విగ్రహం పెట్టి ప్రజలు ఆయనపై అభిమానం చాటుకుంటున్నారని అన్నారు.