పేదల కోసం పోరాడిన మహనీయుడు వంగవీటి
NEWS Aug 25,2024 02:47 pm
పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిన మహానీయుడు వంగవీటి మోహన రంగా అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. ఈ మేరకు ఆమె పెదపూడి మండలంలోని కాండ్రేగులలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో ఆయన సేవలను కొనియాడారు.