అమూజూరులో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
NEWS Aug 25,2024 03:03 pm
కె.గంగవరం మండలస్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని అమూజూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల బీజేపీ అధ్యక్షుడు ఎవి రమణమూర్తి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మండలంలోని ప్రతీ గ్రామంలో సభ్యత్వాల నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. చిట్టిబాబు, జయలక్ష్మి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.