అమలాపురంలో కొబ్బరి రైతుల జాతీయ సదస్సు
NEWS Aug 25,2024 02:49 pm
దేశ వ్యాప్తంగా కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు అమలాపురంలో 27, 28వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి తెలిపారు. అమలాపురంలో జరిగిన సమావేశంలో బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటానందం, నాయకులు ఆదినారాయణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు.