ఎమ్మెల్సీ బొత్సను కలిసిన జెడ్పీటీసీ
NEWS Aug 25,2024 02:30 pm
అరకు: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యులు బొత్స సత్యనారాయణను అరకులోయ జడ్పీటీసీ శెట్టి రోషిణి, శెట్టి అశోక్ దంపతులు మర్యాధపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్సకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అరకులోయ మండలంలోని గ్రామాలలో ఉన్న మౌలికసదుపాయాల సమస్యలను ఎమ్మెల్సీకి తెలిపారు.