దేశ సేవకు బీజేపీ అంకితం: పురందరేశ్వరి
NEWS Aug 25,2024 08:07 am
అధికారాన్ని బీజేపీ సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుందని, దేశ సేవకు అంకితమైందని దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని విద్యుత్ నగర్లో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.