బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
NEWS Jul 27,2026 02:51 pm
HYD: బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చిన సుమారు 300 మంది పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు భోజనం పంపిణీ చేశారు. ఆకలితో ఉన్నవారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని కోరారు.