రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
NEWS Jul 27,2026 02:46 pm
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు వీటిని అందజేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలో ఓ నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓ దినపత్రిక ప్రతులను కాల్చివేసిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.