గోకవరం మండలం రామన్నపాలెం సమీపంలో భారీగా గంజాయి పట్టబడింది. ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ.. 2 రోజుల క్రితం బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వాహనంలో 25 సంచుల్లో 813 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మార్కెట్లో దీని విలువ రూ.40 లక్షల పైనే ఉంటుందని చెప్పారు. స్మగ్లర్స్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.