చెరువులు ఆక్రమిస్తే వదలం: సీఎం
NEWS Aug 25,2024 07:56 am
చెరువులు ఆక్రమించిన వాళ్ళను ఎవర్నీ వదలమని, ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కొందరు బఫర్ జోన్లలో భవనాలు నిర్మించారని, ఆ భవనాల వ్యర్థాలను గండిపేటలో వదులుతున్నారని అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనను అనుసరించే తాను పాలన చేస్తున్నానని అన్నారు రేవంత్.