ద్వారపూడిలో ఆట స్థలం బురదమయం
NEWS Aug 25,2024 02:55 pm
మండపేట మండలం ద్వార పూడిలో ఉన్న మహాత్మ గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణం బురదమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆవరణలో బ్లాక్ క్వారీ బూడిద పోసి నడిచేందుకు వీలుగా రహదారి ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.