మున్నూరు కాపులకు భవనాలు నిర్మించాలి
NEWS Aug 25,2024 08:22 am
KMR: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మున్నూరు కాపు భవనాలను ప్రభుత్వం నిర్మించాలని మున్నూరు కాపు సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు బాజా లలిత ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో మున్నూరు కాపుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సంఘ సభ్యులు మౌన దీక్షను చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు.