కుండలేశ్వరుని సన్నిధిలో నటుడు పృథ్వీరాజ్
NEWS Aug 25,2024 08:10 am
సినీ నటుడు పృథ్విరాజ్ కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరంలో కొలువు తీరిన శ్రీపార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన పృథ్వీరాజ్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.