కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ మేరకు భక్తుల స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం అష్టోత్తర నిత్యా కళ్యాణ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో భక్తులు గో పూజలను నిర్వహించారు.