మిగులు జలాలు సముద్రంలోకి విడుదల
NEWS Aug 25,2024 08:20 am
రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి శనివారం సాయంత్రం 2,34,613 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజ్ వద్ద 10.60 అడుగులకు నీటి మట్టం చేరిందన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,100 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.