4 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
NEWS Aug 25,2024 06:14 am
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నట్లు టీటీడీ ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. పురటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, జిల్లాయంత్రాంగం సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.