విస్తారంగా వర్షాలు.. ఆనందంలో రైతులు
NEWS Aug 25,2024 05:38 am
ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పొలాల్లో సమృద్ధిగా నీరు చేరింది. దీంతో పంటల సాగుకోసం నీటి కోరత తీరినట్టు రైతులు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటుచేసిన గుంతల్లో వర్షపు నీరు చేరింది. నిండుకుండలా జలకళలాడుతున్నాయి. గిరిజన రైతులు పండిస్తున్న వరి, కురగాయలు, జోన్నలు, రాగులు, కొర్రలు తదితర పంటలకు పుష్కలంగా సాగునీరు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. సాగునీటి చెరువుల్లో జలకళ సంతరించుకుంది.