పలు మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం
NEWS Aug 25,2024 05:41 am
శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు మండలాలలో ఆదివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ నారాయణస్వామి నాయక్ తెలిపారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, గోరంట్ల ప్రాంతాలలో ప్రధాన విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.