భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడిగా సోమశేఖర్
NEWS Aug 24,2024 05:08 pm
భారతీయ కిసాన్ యూనియన్ (ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా సోమశేఖర రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హిందూపురం పట్టణంలో ఘనంగా సన్మానించారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఇందులో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్, ప్రజా సంఘాల నాయకులు బాలాజీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.