ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.